Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 'స్ట్రెస్' నేపథ్యంలో ప్రత్యేక కేటాయింపులు: ఎస్బీఐ
కోల్కతా: దేశంలోని టెలికాం రంగం తీవ్ర ఒత్తిడిలో ఉందని బ్యాంకింగ్ దిగ్గజం భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) మరోమారు ఆందోళన వ్యక్తం చేసింది. బ్యాంకు చైర్మెన్ అరుందతీ భట్టాచార్య ఈ విషయమై స్పందిస్తూ టెలికాం రంగంలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నందున ఈ రంగంలోని రుణాలపై అనిశ్చితిని తట్టుకేందుకు గాను తాము ప్రత్యేక కేటాయింపులు జరుపుతున్నటు తెలిపారు. స్థానిక న్యూటౌన్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన స్టేట్ బ్యాంక్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ను భట్టాచార్య శనివారం ప్రారంభించారు. ఐయూసీ చార్జీలను తగ్గిచడం వల్ల ఇప్పటికే ఒత్తిడిలో ఉన్న వొడాఫోన్, ఎయిర్టెల్, ఐడియా వంటి సంస్థలు మరింత అనిశ్చితిలోకి జారిపోనున్నాయని విశ్లేషకులు చెబుతున్న తరుణంలో భట్టాచార్య వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఎస్బీఐ నిరర్థక ఆస్తులను వీలైనంత కనిష్టానికి తగ్గించుకొనే క్రమంలో లక్ష్యానికి చేరువలో ఉందని తెలిపారు. అనుబంధ బ్యాంకుల విలీనం ఒక లోతైన నిర్మాణాత్మ సంస్కరణ అని అన్నారు. విలీనం వల్ల కలిగిన మేలు రానున్న రెండు మూడు త్రైమాసికాల్లో కనిపించగలదని ఆయన అభిప్రాయపడ్డారు. టెలికాం రంగం ఒత్తిడిలో ఉన్నప్పటికీ రాని బాకీలు నియంత్రణలోనే ఉన్నాయని తెలిపారు.