Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: భారత్ ఎలక్ట్రానిక్స్ అండ్ మొబైల్ల తయారీ హబ్గా రూపొందుతోందని ఐటీ శాఖ మంత్రి రవి శంకర్ ప్రసాద్ అన్నారు. ఇప్పటికే దేశంలో దాదాపు 95 మొబైల్ తయారీ సంస్థలు తమ ఉత్పితి కేంద్రాలను ఇక్కడ ప్రారంభించినట్టుగా ఆయన తెలిపారు. ఇందులో దాదాపు 32 కంపెనీలు నోయిడా సమీపంలోనే ఏర్పాటు అయినట్టుగా వివరించారు. ఇక్కడ ఏర్పాటు చేసిన 'ఎమర్జింగ్ డిజిటల్ వరల్డ్ ఇన్ ఇండియా' సదస్సులో మంత్రి పాల్గొని ప్రసంగించారు. భారతీయులు అపార మేథస్సుకు ప్రతిరూపాలని ఆయన అన్నారు. సిలికాన్ వ్యాలీలో 51 శాతం కొత్త ఆవిష్కరణలు ఐటీ ఆధారితమైనవేనని అన్నారు. ఇందులో 14 శాతానికి పైగా ఆవిష్కరణలను భారతీయులే కనుగొంటున్నట్టుగా ఆయన తెలిపారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు తమ వ్యాపారాలను విస్తరిస్తూ తమకు అసవరమైన నిధులను పెట్టుబడిదారుల నుంచి సమీకరిస్తున్నట్టుగా ఆయన తెలిపారు. ప్రతిరోజూ 3-4 అంకుర సంస్థలు పుట్టుకొస్తున్నాయని ఆయన వివరించారు. చాలా మంది ఐఐటీయన్లు తమ ఉద్యోగాలను వదులుకొని అమెరికా నుంచి భారత్కు తిరిగి వచ్చి అంకుర సంస్థలను స్థాపిస్తుండడం ఆహ్వనించదగ్గ పరిణామమని ఆయన అన్నారు.