Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ వాహన తయారీ దిగ్గజం మారుతీ సుజుకీ ఇండియా కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన డిజైర్ కారు సరికొత్త రికార్డు నెలకొల్పింది. గత నెల (ఆగస్టులో) దేశవ్యాప్తంగా అత్యధికంగా అమ్ముడైన వాహనంగా డిజైర్ సంచలనం సృష్టించింది. కార్ల అమ్మకాల్లో గత కొన్ని సంవత్సరాలుగా అగ్రగామిగా ఉంటూ వస్తున్న ఆల్టోను వెనక్కినెట్టి కొత్త డిజైర్ ఆ స్థానాన్ని అక్రమించడం విశేషం. న్యూడిజైర్ వాహనాన్ని ఈ ఏడాది మేలో విడుదల చేయగా, ఆగస్టులో 26,140 యూనిట్లు అమ్ముడుపోయాయి. అదే సమయంలో ఆల్టో అమ్మకాలు 21,521 యూనిట్లకే పరిమితమైయ్యాయి. అయితే గతేడాది ఇదే సమయంలో పాత డిజైర్ మోడల్ కార్లు కేవలం 15,766 యూనిట్ల మేర విక్రయమవ్వడం విశేషం, అప్పుడు ఆల్టో అమ్మకాలు 20,919 యూనిట్లుగా ఉంది. 'సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మ్యానుఫ్యాక్చర్స్' (సియామ్) విడుదల చేసిన గణాంకాల ప్రకారం అత్యధికంగా అమ్ముడైన టాప్ 10 వాహనాల్లో ఏడు మారుతీ సుజుకీ ఇండియావే కావడం గమనార్హం. మిగిలిన మూడు వాహనాలు హ్యుందారు మోటార్ ఇండియావి. అత్యధిక విక్రయాలతో టాప్ 10లో నిలిచిన కార్లలో మారుతీ బాలినో (3), విటారా బ్రీజా (4), వేగన్ ఆర్ (5), స్విఫ్ట్ (6), హ్యుందారు గ్రాండ్ ఐ10(7), ఇలైట్ ఐ20(8), సెలెరియో(9), రెనో క్విడ్(10)లు ఉన్నాయి.