Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ మెగా పబ్లిక్ ఇష్యూ చప్పగా ముగిసింది. దాదాపు రూ.11,300 కోట్ల నిధుల సమీకరణకు సంస్థ ఐపీవోకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇష్యూ చివరి రోజైన శుక్రవారం గడువు ముగిసే సమయానికి ఈ ఐపీవోకు కేవలం 1.37 రెట్ల స్పందన మాత్రమే లభించింది. రిటైల్ ఇన్వెస్టర్ల విభాగంలో 60 శాతం, హెచ్ఎన్ఐ విభాగంలో 22 శాతం, క్విబ్ విభాగంలో 2.25 శాతం స్పందన మాత్రమే లభించడం విశేషం.