Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ ఎగుతుల్లో గణనీయమైన వృద్ధి నమోదు అయినట్టు సర్కారు వెల్లడించింది. గత సెప్టెంబరు మాసంలో దేశీయ ఎగుమతు లు 25.67 శాతం మేర పెరిగి 28.61 డాలర్ల స్థాయికి తాకినట్టు వాణిజ్య శాఖ గణాంకాలను వెలువరించింది. రసాయనాలు, పెట్రోలియం, ఇంజినీరింగ్ ఉత్పత్తుల ఎగుమతుల పెరుగుదల దన్నుతో ఈ వృద్ధి నమోదు అయినట్టుగా సర్కారు తెలిపింది. ఇదే సమయంలో దేశంలో దిగుమతులు కూడా 18.09 శాతం మేర పెరిగి 37.6 బిలియన్ డాలర్లకు చేరినట్టుగా వాణిజ్య శాఖ తెలిపింది.