Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిలయన్స్ ప్రాఫిట్స్లో13% వృద్ధి
- ఆదాయంలో 24% పెరుగుదల
- జియో నష్టం రూ.271 కోట్లు
న్యూఢిల్లీ: ముఖేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ ఇండిస్టీస్ (ఆర్ఐఎల్) సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికానికి మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికానికి సంస్థ 12.5శాతం వృద్ధితో రూ.8,109 కోట్ల నికర లాభాలు నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసిక కాలంలో సంస్థ రూ.7,206 కోట్ల లాభాలను ఆర్జించిన సంగతి తెలిసిందే. సెప్టెంబరుతో ముగిసిన మూడు నెలల కాలంలో సంస్థ ఏకీకృత ఆదాయంలో 24 శాతం వృద్ధి నమోదు అయింది. అంతకు ముందు ఏడాది సెప్టెంబరు త్రైమాసికంలో రూ.81,651 కోట్లుగా ఉన్న సంస్థ ఆదాయం ఏడాది తిరిగే సరికి రూ.1,01,169 కోట్లకు చేరింది.
కొనసాగిన జియో నష్టాలు..
టెలికాం రంగంలో జియో పేరుతో భారీ ఆఫర్లను ప్రకటించి తీవ్ర పోటీని సృష్టించిన రిలయన్స్ సంస్థ సెప్టెంబరు త్రైమాసికంలోనూ ఈ విభాగంలో నష్టాలను నమోదు చేసింది. గత సెప్టెంబర్తో ముగిసిన త్రైమాసికంలో ఈ కంపెనీ రూ.271 కోట్ల నష్టాల పాలయినట్టుగా రిలయన్స్ వెల్లడించింది. అంతకు ముందు త్రైమాసికంలో ఈ విభాగం రూ.21.3 కోట్ల నష్టాలను నమోదు చేసిన సంగతి తెలిసిందే. గత త్రైమాసికంలో జియో రెవెన్యూ రూ.6,147 కోట్లుగా ఉంది. క్రితం సెప్టెంబర్ 30 నాటికి 13.86 కోట్ల ఖాతాదారులకు చేరువైంది.