Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిర్వహణ నుంచి క్రమంగా తప్పుకుంటున్న సిక్కా వర్గం
బెంగళూరు: ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్లో అంతర్గత లుకలుకలు కొనసాగుతూనే ఉన్నాయి. సంస్థ అధినేతగా నందన్ నీలేకని బాధ్యతలు చేపట్టినప్పటికీ సంస్థలో ఉన్నత స్థాయి ఉద్యోగుల రాజీనామాలు మాత్రం కొనసాగుతూనే వస్తున్నాయి. సంస్థ నుంచి తాజాగా మరో ఇద్దరు సీనియర్ ఎగ్జిక్యూటివ్లు వైదొలిగారు. సీనియర్ వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ రజాక్, ఎడ్జ్ వేర్వే (ప్లాట్ఫామ్స్ సబ్సిడరీ) సీఈవో పెర్విందర్ జోహార్లు తమ పదవులకు రాజీనామా చేస్తున్నన్నట్లుగా ప్రకటించారు. రజాక్ కూడా సాప్ (ఎస్ఏపీ) నుంచి వచ్చిన 12 మంది ఉద్యోగుల్లో ఒకరు. సంస్థ మాజీ అధినేత విశాల్ సిక్కాతో కలిసి వారంతా ఇన్ఫీలో చేరారు. సిక్కా ఇన్ఫోసిస్లో నుంచి వైదొలిగినప్పటి నుంచి ఆయనతో పాటు కంపెనీలోకి వచ్చిన ఎగ్జిక్యూటివ్లు ఒక్కొక్కరుగా రాజీనామాలు చూస్తూ వస్తున్నారు. రజాక్ నెలక్రితమే తన రాజీనామా పత్రాలను యాజమన్యానికి సమర్పించినట్టు సమాచారం. జోహార్ కూడా కంపెనీలో చేరి ఎనిమిది నెలలు కాలేదు. స్టీల్వెడ్జ్ సాఫ్ట్వేర్ సంస్థ నుంచి నుంచి ఎడ్జ్వేర్వేలో ఆయన చేరారు. ఇన్ఫోసిస్ మొత్తం ఆదాయంలో ఎడ్జ్వేర్వే 5.5 శాతం రెవెన్యూ వాటా కలిగి ఉంది. కొత్త చైర్మన్ నందన్ నిలేకని సారథ్యంలో కంపెనీలో ఈ పునర్వ్యవస్థీకరణ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయని ఆ వర్గాలు పేర్కొంటున్నాయి.