Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ఇన్స్టిట్యూట్ ఆఫ్ కాస్ట్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ఐసీఏఐ) హైదరాబాద్ చాప్టర్ మేనేజింగ్ కమిటీ చైర్మెన్గా చంద్రశేఖర్ రాజనాల ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2017-19 మధ్య కాలానికి సంబంధించి చాప్టర్ మేనేజింగ్ కమిటీ ఎన్నికలు హైదరాబాద్లో జరిగాయి. ఐఏసీఏ హైదారబాద్ చాప్టర్ వైస్ చైర్మెన్గా మునిశేఖర్ దారపనేని, కార్యదర్శిగాగా కల్యాణి పెమ్మరాజు, కోశాధికారిగా చంద్రశేఖర్ రెడ్డి పొనుగోటి ఎన్నికైనట్టుగా చాప్టర్ ఒక ప్రకటనలో తెలిపింది. కె.వి.ఎన్.లావణ్య, సుధా రాణిలు ఇతర మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు.