Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: త్వరలో రెండో దశ జియో ఫ్రీ ఫోన్ బుకింగ్స్ను ఆ సంస్థ ప్రారంభినుందని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. ఆగస్టు 24న మొదటి దశ జియో ఫ్రీ ఫోన్ బుకింగ్స్ను నిర్వహించిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా కేవలం మూడు రోజుల వ్యవధిలోనే దాదాపు ఆరు మిలియన్ల మంది జియో ఫోన్ను బుక్ చేసుకున్నారు. కాగా దీనికి సంబంధించిన డెలివరీ సైతం దాదాపు పూర్తి అయినట్టు తెలుస్తోంది. దీంతో రెండో విడత బుకింగ్స్ను నిర్వహించాలని జియో భావిస్తోంది. దీనికి సంబంధించిన ప్రకటనను త్వరలో విడుదల చేస్తామని జియో ప్రతినిధి ఒకరు తెలిపారు. అయితే రెండో దశ జియో ఫోన్ బుక్సింగ్స్ను దీపావళి తర్వాత ప్రారంభించవచ్చని, అది అక్టోబర్ చివరి నాటికి లేదా నవంబర్ మొదటి వారం ఉండొచ్చని జియో వర్గాలు పేర్కొన్నాయి. గత జులై 21న రిలయన్స్ 40వ వార్షిక సర్వసభ్య సమావేశంలో జియో ఫోన్ పేరుతో ఫీచర్ ఫోన్ను ఆవిష్కరించిన విషయం తెలిసిందే. ఫోన్ ఉచితం అయినప్పటికీ రూ.1500 సెక్యూరిటీ డిపాజిట్ చేయాల్సి ఉండగా, మూడేండ్ల తర్వాత ఆ డబ్బును వినియోగదారులకు వాపసు ఇస్తామని జియో ప్రకటించిన విషయం తెలిసిందే.