Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నిటి అయోగ్ వైస్ చైర్మెన్ రాజీవ్ కుమార్
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత్ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు 6.9శాతం-7శాతం మధ్యలో నమోదు కావచ్చని నితి అయోగ్ వైస్ చైర్మెన్ రాజీవ్ కుమార్ అన్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరం (2018-19)లో జీడీపీ వృద్ధి 7.5శాతం నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. మరోవైపు 2007-13 ఆర్థిక సంవత్సరం వరకు భారత్ జీడీపీ వృద్ధి రేటు మెరుగ్గా రాణించిందన్నారు. 2013-14 నుంచి దేశ ఆర్థిక వృద్ధి రేటు నెమ్మదిగా తగ్గుకుంటూ వస్తుందని రాజీవ్ కుమార్ వివరించారు. 2007 నుంచి ఆర్థిక వృద్ధి రుణాలు భారీ పెరగడంతో వృద్ధి రేటు పతనానికి ముఖ్య కారణమని ఆయన విశ్లేషించారు. ఇదే క్రమంలో గతేడాది కేంద్రంలోని మోడీ సర్కారు పెద్దనోట్లను రద్దు చేయడంతో దేశంలోని అన్ని రంగాల్లో వృద్ధి పడిపోయిన సంగతి తెలిసిందే. దీంతో గతేడాది 2016-17లో ఆర్థిక వృద్ధి రేటు మొత్తంగా 7.1శాతానికి పరిమితమ య్యిందన్నారు. ఈ ఏడాది తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో జీడీపీ వృద్ధి రేటు 5.7శాతానికి క్షీణించి..మూడేండ్ల కనిష్టానికి పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది (2018) తొలి త్రైమాసికంలో జీడీపీ వృద్ధి రేటు మెరుగైన ఫలితాలు నమోదు చేయనుందని ఆయన వివరించారు. ఇక దేశీయ వృద్ధి రేటు అంచనాలను ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలతో పాటు ఆర్బీఐ కూడా తగ్గించిన సంగతి తెలిసిందే.