Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెనుకబడ్డ బీజేపీ పాలిత రాష్ట్రాలు!: ప్రపంచబ్యాంక్ నివేదిక
న్యూఢిల్లీ: కేంద్రంలోని మోడీ సర్కార్ చేపట్టిన సులభతర వాణిజ్యం(ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్) సంస్కరణలకు చుక్కెదురైంది. ఈవోడీబీలో దేశంలోని 11 రాష్ట్రాలకు జీరో ర్యాంకింగ్ లభించింది. వీటిలో మూడు బీజేపీ పాలిత రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మధ్యప్రదేశ్ ఉన్నాయి. ప్రధానంగా వ్యాపార సంస్కరణల విషయంలో ఈ రాష్ట్రాలు సరైన చర్యలు తీసుకోకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. జీరో ర్యాంకింగ్ పొందినవాటిలో మేఘాలయ, సిక్కిం, అరుణాచల్ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్,మిజోరం, లక్షదీప్, అండమాన్-నికోబార్ ఉన్నాయి. 2017ఏప్రిల్లో ప్రపంచబ్యాంక్, డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండిస్టియల్ పాలసీ అండ్ ప్రమోషన్(డీఐపీపీ) సంయుక్తంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కార్యాచరణ ప్రణాళిక నివేదికను తయారు చేశాయి. దేశంలో వ్యాపార అనుమతులను సులభతరం చేయడానికి మొత్తం 405 సిఫారసులను సూచించాయి. నిర్వహణా సామర్ధ్యంలో 20కిపైగా స్కోర్ సాధించిన వాటిలో ఐదు రాష్ట్రాలున్నాయి. వీటిలో తెలంగాణ 37.37, హార్యానా 34.41, పశ్చిమబెంగాల్ 27.69, అస్సాం 24.46, మహారాష్ట్ర 22.58 స్కోర్ సాధించినట్టు నివేదిక తెలిపింది.