Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ఆహార ఉత్పత్తులు, కూరగాయల ధరల ఉపశమనంతో సెప్టెంబర్ నెలలో టోకు ఆధారిత ధరల ద్రవ్యోల్బణం (డబ్ల్యుపీఐ) సూచీ 2.60శాతానికి దిగివచ్చింది. ఆగస్టు నెలలో ఈ సూచీ 3.24శాతంతో నాలుగు నెలల గరిష్ట స్థాయి వద్ద నమోదైన విషయం తెలిసిందే. గత నెలలో అహారోత్పత్తుల ధరల సూచీ 2.04శాతానికి తగ్గింది. అంతకు క్రితం ఇది 5.75శాతంగా నమోదయ్యింది. గత సెప్టెంబర్లో కూరగాయల ద్రవ్యోల్బణం 15.48శాతంగా చోటు చేసుకుంది. జులైలో ఇది 44.91శాతంగా ఉంది. ఉల్లి ధరలు 79.78శాతంతో రికార్డు స్థాయి గరిష్టంగానే నమోదయ్యాయి. గుడ్లు, మాంసం, చేపలు ధరలు 5.47శాతం పెరిగాయి. తయారీ వస్తువులు 2.45శాతం నుంచి 2.72శాతానికి పెరిగాయి. ద్రవ్యోల్బణం సూచీ తగ్గడంతో భవిష్యత్తులో రిజర్వు బ్యాంకు వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.