Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రముఖ ప్రయివేటు రంగ దిగ్గజం యాక్సిస్ బ్యాంకుకు మొండి బాకీలు పెరిగిన ఆకర్షణీయ ఆర్ధిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం జులై-సెప్టెంబర్తో ముగిసిన ద్వితీయ త్రైమాసికంలో బ్యాంకు నికర లాభాలు 36శాతం వృద్ధితో రూ.432 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే సమయంలో రూ.319 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో నికర వడ్డీ ఆదాయం రూ.4,514 కోట్ల నుంచి రూ.4,540 కోట్లకు పెరిగింది. మరోవైపు వడ్డీయేతర ఆదాయం 2 శాతం వృద్ధితో 2,586 కోట్లకు చేరింది.క్రితం రెండో త్రైమాసికంలో బ్యాంకు స్థూల, నికర నిరర్థక ఆస్తులు వరుసగా 5.9శాతం, 3.12శాతంగా నమోదు అయ్యాయి. ఇంతక్రితం జూన్తో ముగిసిన త్రైమాసికంలో ఇవి 5.03శాతం, 2.30శాతంగా ఉన్నాయి. క్రితం త్రైమాసికంలో బ్యాంకు స్థూల ఎన్పీిఏలు ఏకంగా 67.31 శాతం పెరిగి రూ.27,402.32 కోట్లకు చేరాయి. ఇదే సమయంలో కొత్తగా రూ.8,936 కోట్ల మొండి బాకీలను చవి చూసింది. ఇందులో కార్పొరేట్ రుణాలే రూ.8,110 కోట్లుగా ఉన్నాయి. గత త్రైమాసికంలో బ్యాంకు డిపాజిట్లు రూ.4,16,431 కోట్లుగా నమోదయ్యాయి. అడ్వాన్సులు 16శాతం వృద్ధితో రూ.4,10,171 కోట్లకు పెరిగాయి.