Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: టెలికాం సేవల రంగంలో నెలకొన్న ధరల పోటీ, వస్తుసేవల పన్ను (జీఎస్టీ) కారణంగా సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ఐడియా సెల్యులార్ భారీ నష్టాన్ని ప్రకటించింది. జులై-సెప్టెంబరు మధ్య కాలానికి సంస్థ రూ.1,106 కోట్ల మేర నికర నష్టాన్ని ప్రకటించింది. టెలికాం పరిశ్రమలో నెలకొన్న తీవ్ర పోటీ, విధానపరమైన మార్పులు ఇందుకు కారణమని ఒక ప్రకటనలో తెలిపింది. అంతకు ముందు జూన్తో ముగిసిన మొదటి త్రైమాసికంలో సంస్థ రూ.814.90 కోట్ల నష్టాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా గత ఏడాది ఇదే రెండో త్రైమాసికంలో సంస్థ రూ.91.50 కోట్ల లాభాన్ని ఆర్జించింది. రెండో త్రైమాసికంలో సంస్థ ఏకీకృత రాబడి రూ.7,468.50 కోట్లుగా నమోదు అయింది. గతేడాది ఇదే కాలంలో సంస్థ ఆదాయం రూ.9,300.30 కోట్లుగా నిలిచింది. ఈసారి సంస్థ రెవెన్యూ నష్టాలు మరింత పెరిగాయి. ఇక మొబైల్ డేటా రియలైజేషన్ 49.2 శాతం తగ్గింది. అంటే నిమిషానికి 5.54 పైసల నుంచి 2.7కు పడిపోయింది.