Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో (పీఎస్బీ) పెరిగిపోతున్న నిరర్థక ఆస్తుల (ఎన్పీఏ)సమస్య పరిష్కారానికి బ్యాంకర్లు సత్వర, స్థిరమైన చర్యలు చేపట్టాలని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ సూచించారు. ప్రస్తుతం దేశంలోని పీఎస్బీల్లో ఎన్పీఏలు రూ.7లక్షల కోట్లకు చేరువై ఆర్థిక వ్యవస్థకు పెద్ద సవాలుగా మారిన నేపథ్యంలో జైట్లీ ఈ దిశగా బ్యాంకర్లుకు దిశానిర్దేశం చేసినట్టుగా సమాచారం. ఇక్కడ రెండు రోజుల పాటు జరిగిన 'పీఎస్బీ మంథన్' ఉన్నతస్థాయి సమావేశంలో ఎన్పీఏల పరిష్కార విషయమై బ్యాంకర్లకు స్పష్టమైన ఆదేశాలు జారి చేసినట్టు సమాచారం. ఈ సమావేశంలో ప్రధానంగా ఒత్తిడిలో ఉన్న ఆస్తుల రికవరీల కోసం సమర్థవంతమైన పర్యవేక్షణపై చర్చించారని ఒక ప్రభుత్వ బ్యాంకునకు చెందిన సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఎన్పీఏల పరిష్కర ప్రక్రియలో భాగంగా మెరుగైన విలువను గుర్తించడంపై ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిపారు. భారం తగ్గించే క్రమంలో సెటిల్మెంట్ చేయగల కేసులను పరిష్కరాలపై పలు సూచనలను చేశారు. దీనికితోడు విభిన్న విధానాల వైపు ఆలోచించాలని..తద్వారా వారి ఆర్థిక విధానాలు బలోపేతం అవుతాయని అన్నారు. 2017 జూన్ నాటికి ప్రభుత్వ రంగ బ్యాంకుల ఎన్పీఏలు రూ.7.33 లక్షలకు చేరినట్టు గుర్తించారు. కాగా 2015 మార్చి నాటికి ఇవి రూ.2.78 లక్షల కోట్లుగా ఉన్నాయి. మరోవైపు 2014-15లో నుంచి 2017-18 తొలి త్రైమాసికం నాటికి బ్యాంకులు రూ.3.79 లక్షల కోట్లు కేటాయింపులు జరపగా.. గడిచిన పదేండ్ల్లలో ఈ కేటాయింపులు కేవలం రూ.1.96 లక్షల కోట్లుగా నమోదు కావడం విశేషం.