Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: దేశంలో సురక్షితమైన విమాన సేవలను అందించడంతో ఎయిర్ ట్రాఫిక్ సేఫ్టీ ఎలక్ట్రానిక్స్ పర్సనల్స్ (ఏటీఎస్ఈపీ) అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమైనవని హైదరాబాద్ ఎయిర్పోర్ట్ డైరెక్టర్ (సీఎన్ఎస్) జి.ఎస్.రావు అన్నారు. బేగంపేట విమానాశ్రయ ప్రాగణంలో సీఎన్ఎస్ అధికారుల గిల్డ్ ఏర్పాటు చేసిన వార్షిక మేథోమధన సమావేశంలో ఆయన ప్రాల్గొని ప్రధానోపన్యాసం చేశారు. కార్యక్రమంలో సీఎన్ఎస్ ఆఫీసర్స్ గిల్డ్ స్థానిక కార్యదర్శి సీహెచ్ మహేశ్ మాట్లాడుతూ దేశానికి ఏటీఎస్ఈపీ సభ్యులు అందిస్తున్న విలువైన సేవలు, దేశ భద్రతలో వారి ప్రాధాన్యతలను గురించి వివరించారు. కార్యక్రమంలో గిల్డ్ స్థానిక అధ్యక్షుడు ఎన్.వి.హెచ్. హనుమంత్ కుమారుతో పాటు ఎయిరిండియా ఇంజినీరింగ్ విభాగం జీఎం సోలోమాన్ జయబాలన్తో పాటు వాతావారణ శాఖ డైరెక్టర్ వై.కె.రెడ్డి, డీజీసీఏ డైరెక్టర్ సురెందర్ టోపోతో పాటు ఏటీఎం విభాగం జీఎం వో.ఎస్.ఎక్కా తదితరులు ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో గిల్డ్ సభ్యులు ఏటీఎస్ఈపీలు విధి నిర్వహణలో ఇటీవలి కాలంలో ఎదుర్కొంటున్న ప్రధాన సవాళ్ల ప్రత్యామ్నాయ మార్గాలను గురించి ఈ వేదికపై చర్చించారు.