Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : కొత్తకొత్త నిర్మాణ రంగ తయారీ ఉత్పత్తులను ప్రదర్శించే 'సీఐఐ ఎక్సాన్ 2017' వచ్చే నెల ఏర్పాటు కానుంది. డిసెంబర్ 12 నుంచి 16వ తేది వరకు బెంగళూరులో ఈ మెగా ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నట్టు 'ఎక్సాన్ 2017' స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆనంద్ సుందరేసన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2,50,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఐదు రోజుల పాటు ఈ మెగా ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నామన్నారు. దక్షిణ ఆసియాలోనే అతిపెద్ద ఈ ప్రదర్శనలో ముఖ్యంగా నిర్మాణ రంగం ఉత్పత్తులు, ఆ రంగం టెక్నలాజీ ట్రేడ్ ఫెయిర్ను సీఐఐ నిర్వహిస్తుందన్నారు. ఈ ప్రదర్శనలో దేశ విదేశాలకు చెందిన దాదాపు 1000 మంది ప్రదర్శకులు పాల్గొనన్నుట్టుగా తెలిపారు.