Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: చౌక ధరల విమానయాన సంస్థ స్పైస్జెట్ సెప్టెంబరుతో ముగిసిన రెండో త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో సంస్థ ఏకంగా ఏకంగా 79 శాతం వృద్ధితో రూ.105 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గతేడాది ఇదే త్రైమాసికంలో స్పైస్జెట్ లాభం రూ.58.91 కోట్లుగా నమోదు అయింది. మరోవైపు రెండో త్రైమాసికంలో సంస్థ నికర ఆదాయం 30 శాతం మేర ఎగిసి రూ.1,797 కోట్లకు చేరిందని స్పైస్జెట్ ఒక ప్రకటనలో తెలిపింది. ఫలితాలం నేపథ్యంలో ఈ సంస్థ స్టాక్ 4.78 శాతం వృద్ధితో రూ.149.10 వద్ద ముగిసింది.