Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశంలో అతిపెద్ద స్టాక్ ఎక్స్ఛేంజైన 'బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ' (బీఎస్ఈ) చైర్మెన్గా ప్రముఖ చార్టర్డ్ అకౌంటెంట్ సేథురత్నం రవి నియమితులయ్యారు. రవి ప్రస్తుతం దీరేంద్ర స్వరూప్ స్థానంలో బీఎస్ఈలో పబ్లిక్ ఇంట్రెస్ట్ డైరెక్టర్గా సేవలను అందిస్తున్నారు. రెగ్యూలేటరీ ఫైలింగ్లో ఈ విషయాన్ని బీఎస్ఈ వెల్లడించింది. బీఎస్ఈ చైర్మెన్గా సేథురత్నం రవి నియమకానికి సెబీ సమ్మతి తెలిపిందని.. ఆయన నియామకం సోమవారం (13వ తేదీ) నుంచి అమలులోకి వచ్చినట్టుగా బీఎస్ఈ తెలిపింది. వివిధ బ్యాంకులకు చెందిన బోర్డులు, ఆర్థిక సంస్థలు, అసెట్ మేనేజ్మెంట్ కంపెనీల్లో పనిచేసిన అనుభవం రవి సోంతం.