Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - వాణిజ్య విభాగం: ఎన్ఎండీసీ సెప్టెంబరుతో ముగిసిన త్రైమాసికానికి ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. జులై-సెప్టెంబరు త్రైమాసికంలో సంస్థ నికర లాభాలు 10 శాతం మేర పెరిగి రూ.844.40 కోట్లకు చేరాయి. గత ఏడాది ఇదే త్రైమాసికంలో సంస్థ రూ.770.76 కోట్ల నికర లాభాలను ఆర్జించింది. గత రెండో త్రైమాసికం ఆర్థిక ఫలితాలను సంస్థ సీఎండీ ఎన్ బజేంద్ర కుమార్ అధ్యక్షతన బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదించినట్టుగా సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. సెప్టెంబరు త్రైమాసికంలో ఎన్ఎండీసీ మొత్తం ఆదాయం రూ.2,012.64 కోట్ల నుంచి రూ.2,531.18 కోట్లకు ఎగిసింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్తో ముగిసిన ప్రథమార్థంలో కంపెనీ మొత్తం ఆదాయం రూ.5,501 కోట్లు, నికర లాభాలు రూ.1,813.66 కోట్లుగా నమోదయ్యాయి.