Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా మూడో రోజూ నష్టాల పాలయ్యాయి. భారత వాణిజ్య లోటులో పెరుగుదల మార్కెట్లలో భయాన్ని సృష్టించింది. అదే విధంగా పలు కార్పొరేట్ కంపెనీల ఆర్ధిక ఫలితాలు కూడా నిరుత్సాహపర్చాయి. దీంతో బిఎస్ఇ సెన్సెక్స్ 181.43 పాయింట్లు లేదా 0.55 శాతం క్షీణించి 32,760.44కు దిగజారింది. ఉదయం 32,945 మొదలైన సూచీ రోజంతా ఒత్తిడికి గురైంది. కాగా ఇంతక్రితం రెండు సెషన్లలో బిఎస్ఇ 372.69 పాయింట్లు కోల్పోయింది. ఎన్ఎస్ఇ నిఫ్టీ 68.55 పాయింట్లు లేదా 0.67 శాతం తగ్గి 10,118 వద్ద ముగిసింది. ఇంట్రా ట్రేడింగ్లో నిఫ్టీ 10,175-10,094 మధ్యట్రేడింగ్ అయ్యింది. ప్రస్తుత ఏడాది దేశ స్థూల ఎగుమ తులు 1.12 శాతం తగ్గి 23 బిలియన్ డాలర్లకు పరిమితమ య్యాయని కేంద్ర గణంకాల శాఖ మంగళవారం ఒక నివేది కలో విడుదల చేసింది. ఇదే సమయంలో దిగుమతులు 7.6 శాతం ఎగిసి 37.11 బిలియన్ డాలర్లకు చేరాయి. ఎగుమ తులు తగ్గడం, దిగుమతులు పెరగడంతో గత అక్టోబర్లో వాణిజ్య లోటు 14 బిలియన్ డాలర్లకు ఎగిసి, మూడేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఈ పరిణామం మదుపర్లలో విశ్వాసాన్ని దెబ్బతీసిందని బ్రోకర్లు పేర్కొ న్నారు. అదే విధంగా ఆసియన్ మార్కెట్లు బలహీనంగా చోటు చేసుకోవడం, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ముగి యడం, అంతర్జాతీయంగా చమురు ధరలు పెరగడం, అమె రికాలో పన్ను సంస్కరణలు అమలుపై స్తబ్దత తదితర పరిణామాలు మార్కెట్లను ఒత్తిడికి గురి చేశా యి. సెన్సెక్స్ లో ఐటిసి 1.46 శాతం, ల్యూపిన్ 1.50 శాతం, ఎన్టిపిసి 1.70 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.15 శాతం, ఒఎన్జిసి 2.55 శాతం, సన్ ఫార్మా 4.01 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్లో ఉన్నాయి.