Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ వాణిజ్య విభాగం: దిగ్గజ స్థిరాస్తి సంస్థ ఓంకార్ రియల్టర్స్ అండ్ డెవలపర్స్ మరో భారీ రెసిడెన్షియల్ ప్రాజెక్టును ప్రకటించింది. 'పాస్కోడ్ అంధేరీ హైవే' పేరుతో ఈ ప్రాజెక్టును చేపడుతున్నాట్టుగా సంస్థ తెలిపింది. ముంబయిలోని వెస్ట్రన్ ఎక్స్ప్రెస్ హైవే సమీపంలోని అంధేరీ-జోగేశ్వరి వద్ద దాదాపు రూ.1500 కోట్ల వ్యయంతో 60 ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రాజెక్టును చేపడుతున్నట్టుగా వెల్లడించింది. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన సమావేశంలో సంస్థ డిజైన్ అండ్ ఆర్కిటెక్చర్ విభాగం అధ్యక్షుడు అమర్ టెండుల్కర్ మాట్లాడుతూ తాము రెరా అందుబాటులోకి వచ్చాక తీసుకు వస్తున్న మొదటి ప్రాజెక్టు ఇదేనని తెలిపారు. ఈ ప్రాజెక్టులో 1/2/3 బెడ్ రూమ్ ఫ్లాట్లను విక్రయించునున్నట్టుగా వివరించారు. వీటి విస్తీర్ణం 355 నుంచి 710 చదరపు అడుగుల మేర ఉండునున్నట్టుగా తెలిపారు. పలు విలాసవంతమైన సౌకర్యాలతో ఈ ప్రాజెక్టును అందు బాటు ధరల్లో తీసుకువస్తున్నట్టుగా తెలిపారు. ఈ ప్రాజెక్టుకు అవస రమైన రూ.1500 కోట్ల నిధులను అంతర్గత నిధుల సమీకరణతో పాటు డెట్ ఈక్విటీ రూపంలో సమీకరించునున్నట్టుగా వివరించారు.