Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పడిపోవడం, అనుకూల పవనాల నేపథ్యంలో దేశీయ మార్కెట్లు పరుగులు పెట్టాయి. గడిచిన మూడు సెషన్లుగా పడిపోతూ వస్తున్న మార్కెట్లను డాలరు పుంజుకుందని, చమురు ధరలు పడిపోయాయన్న వార్తల నేపథ్యంలో ఐటీ, ఫార్మా రంగాల స్టాక్స్ కొనుగోళ్లు ఊపందుకున్నాయి. దీనికితోడు ఇన్ఫోసిస్, ఎస్బీఐ, టీసీఎస్ లాంటి హెవివెయిట్ షేర్ల జోష్తో మార్కెట్లు పరుగులు పెట్టాయి. దీంతో బీఎస్ఈ సెన్సెక్స్ 346.38 పాయింట్లు లాభపడి 33,106.82 పాయింట్ల వద్ద స్థిరపడింది. మరోవైపు ఎన్ఎస్ఈ 96.70 పాయింట్ల పెరిగి 10,214.75 పాయింట్ల వద్ద ముగిసింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్లో ఎస్బీఐ సూచీ 2.54శాతం, రిలయన్స్ 2.27శాతం, ఎన్టీపీసీ 1.58శాతం, టీసీఎస్ 1.49శాతం చొప్పున లాభాలు అర్జించాయి. మరోవైపు ఎన్ఎస్ఈ నిప్టీ విద్యుత్ సూచీ1.47శాతం, రిలయన్స్ ఇండిస్టీస్ 2.44శాతం, ఇండియన్ అయిల్ కార్పొ లిమిటెడ్ 1.16శాతం, బ్యాంకు సూచీ 0.90శాతం, పీఎన్బీ, కెనారాబ్యాంకు, బీవోబీ కలిసి 5.20శాతం మేర లాభపడ్డాయి.