Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: పుట్టిన రోజు, వివాహ వార్షికోత్సవాలు, ఇతర శుభ కార్యాలకు తమ ఆత్మీయులకు శాస్త్రోక్తంగా శుభాకాంక్షలను అందించే వారికోసం 'ఆచార్యసేతు' పేరుతో యాప్ అందుబాటులోకి వచ్చింది. తెలంగాణాలో ఈ యాప్ సేవలను ఆ సంస్థ సీఈవో ఎం.దుర్గా ప్రసాద్ గురువారం అధికారికంగా ప్రారంభించారు. ఆచార్యసేతు యాప్ ద్వారా ఈ-బ్లెస్సింగ్తో పాటు ఆధ్యాత్మిక కమ్యూనిటీ ఈవెంట్స్ వంటి సేవలను అందుబాటులోకి తెచ్చినట్టుగా ఆయన గురువారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వారికి ఈ సేవలను అందించేందుకు గాను తాము మిలియన్ డాలర్ల వ్యయంతో ఈ సేవలను అందుబాటులోకి తెచ్చినట్టుగా తెలిపారు. ఇప్పటికే తమ సంస్థ దాదాపు 100కు పైగా దేశాల్లో సేవలందిస్తున్నట్టుగా తెలిపారు.