Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: ప్రముఖ డెయిరీ బ్రాండ్ కెవెంటర్స్ హైదరాబాద్ మార్కెట్లోకి తమ మిల్క్షేక్ వ్యాపారాన్ని విస్తరించింది. విస్తరణ పథంలో దూసుకుపోతున్న సంస్థ నగరంలో మూడు అవుట్లెట్లను ప్రారంభించి నట్టుగా సంస్థ సహ వ్యవస్థాపకులు సీఈవో శోరబ్ సీతారామ్ గురువారం తెలిపారు. మొత్తం 35 రకాల మిల్క్షేక్లను తమ స్టోర్స్లో అప్పటికప్పుడు తయారు చేసి అందించనున్నట్టుగా వెల్లడించారు. వీటి ధర రూ.99 నుంచి మొదలు కొని రూ.200ల వరకు ఉండనున్నట్టుగా వివరించారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూరు, కోల్కతాల తరువాత హైదరాబాద్లో సేవలను విస్తరిస్తున్నట్టుగా తెలిపారు. రానున్న కొన్ని నెలల్లో మరో 15కు పైగా స్టోర్లను ప్రారంభించనున్నట్టుగా వివరించారు. 2019 నాటికి ఈ సంఖ్యను 32కు చేర్చనున్నట్టుగా వివరించారు.