Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: దేశీయ టెలికాం దిగ్గజం భారతీ ఎయిర్టెల్ సంస్థ రిలయన్స్ జియోకు పోటీగా మరో రెండు చౌక ధర 4జీ స్మార్ట్ఫోన్లను మార్కెట్లోకి విడుదల చేసింది. 'మేరా పెహలా స్మార్ట్ఫోన్' కార్యక్రమంలో భాగంగా కార్బొన్ మొబైల్స్తో కలిసి రెండు చౌక 4జీ స్మార్ట్ ఫోన్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. 'ఏ1 ఇండియన్', 'ఏ41 పవర్' పేరుతో వీటిని గురువారం అందుబాటులోకి తెచ్చింది. యాండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్తో పని చేసే ఈ మొబైల్ ఫోన్లు, ఎయిర్టెల్ ఆఫర్లో భాగంగా రూ.1,799 (ఎంఆర్పీ ధర రూ.4,390), రూ.1,849లకు (ఎంఆర్పీ రూ.4290) లభించనున్నట్టుగా సంస్థ తెలిపింది. ఈ ఫోన్లు ఎయిర్టెల్ రూ.169ల ఎయిర్టెల్ మంత్లీ ప్యాక్తో లభించనున్నాయి. 169 ప్యాక్లో భాగంగా వినియోగదారులకు 28 రోజుల పాటు అపరిమిత కాలింగ్తో పాటుగా 0.5 జీబీ డేటా కూడా లభించనుంది. తొలత మొత్తం ధరల చెల్లించి ఫోన్ను పొందాల్సి ఉంటుందని ఆ తరువాత రూ.1500 క్యాష్ బ్యాక్ ఇవ్వనున్నట్టుగా సంస్థ తెలిపింది.