Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ప్రముఖ అంతర్జాతీయ రేటింగ్ సంస్థ మూడీస్ భారత్ సావరిన్ బాండ్ రేటింగ్ను అప్గ్రేడ్ చేయడంతో పాటు దీనిని బీఏఏ3 నుంచి బీఏఏ2కి మార్చడంతో శుక్రవారం మార్కెట్లకు పుల్ జోష్ లభించింది. అలాగే భారత్ ఆర్థిక పురోగతి కొనసాగించడంతో పాటు సంస్థాగత సంస్కరణలతో దేశీయ వృద్ధి మరింత బలోపేతం కానుందని మూడీస్ పేర్కొంది. మరోవైపు ప్రపంచమార్కెట్ల సానుకూల సంకేతాలు సైతం దేశీయ సెంటిమెంటుకు మరింత ఉత్సాహనిచ్చింది. ఈ నేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ ఒక దశలో 33,520.82 పాయింట్ల వద్ద చేరగా..చివర్లో హెవీవెయిట్స్ షేర్లలో మదుపర్లు లాభాల స్వీకరణ దిగడంతో సెన్సెక్స్30 346 పాయింట్లు లాభపడి 33,342.80 పాయింట్ల వద్ద ముగిసింది. అలాగే ఎన్ఎస్ఈ నిప్టీ50 68.85 పాయింట్లు పెరిగి 10,283.60 వద్ద స్ధిరపడింది. బీఎస్ఈలో రంగాల వారిగా చూస్తే రియల్టీ సూచీ 3.7శాతం అజేయంగా నిలిచింది. ఇదే వరుసలో లోహా 1.8శాతం, కన్సూమర్ డురెబుల్స్ 1.47శాతం, బ్యాంకింగ్ 1.17శాతం చొప్పున లాభపడగా..మరోవైపు ఐటీ సూచీ 1.38శాతం, టెక్ 1.1శాతం చొప్పున నష్టపోయాయి. బీఎస్ఈ సెన్సెక్స్లో సిప్లా 2.64శాతం, హెచ్డీఎఫ్సీ 2.23శాతం, మారుతీ 2.15శాతం, టాటాస్టీల్ 2.14శాతం, టాటా మోటార్స్ 1.92శాతం చొపున అధిక లాభాలు అర్జించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు ఇన్పోసిస్ 1.79శాతం, టీసీఎస్ 1.33శాతం, ఓఎన్జీసీ 1.03శాతం, విప్రో 0.97శాతం, ఏషియన్ పేయింట్స్ 0.76శాతం చొప్పున అత్యధికంగా నష్టపోయిన వాటిలో ముందు వరుసలో నిలిచాయి.