Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైదరాబాద్ నుంచి అరంగేట్రం
నవతెలంగాణ, వాణిజ్య విభాగం: కువైట్కు చెందిన చౌక ధరల విమానయాన సంస్థ జజీరా ఎయిర్వేస్ శుక్రవారం భారత్కు తమ విమాన సేవలను విస్తరించింది. ఈ సందర్బంగా జజీరా ఎయిర్వేస్ సీఈవో రోహిత్ రామచంద్రన్ మీడియాతో మాట్లాడుతూ భారత్లో తొలుత తమ సేవలను హైదరాబాద్కు అందుబాటులోకి తేవడం ఆనందంగా ఉందని తెలిపారు. 2018 ప్రారంభంలో కొచ్చి, ముంబయి, అహ్మాదాబాద్ నగరాలకు తమ సేవలను విస్తరించనున్నట్లు ఆయన తెలిపారు. కువైట్లో దాదాపుగా 10 లక్షల మంది భారతీయులు జీవిస్తున్నారన్నారు. వీరిని దృష్టిలో పెట్టుకుని భారత్కు సేవలు విస్తరించాలని నిర్దేశించుకున్నామన్నారు. తొలుత తమ సేవలను హైదరాబాద్ నుంచి ప్రారంభించడం ద్వారా కువైట్, రియాద్, జెడ్డా, బెహ్రాయిన్, దుబాయి లాంటి ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టుగా తెలిపారు. ఆయా ప్రాంతాలకు టికెట్ ధరలను రూ.12,500 నుంచి రూ.26,000 మధ్య నిర్ణయించినట్టుగా వివరించారు. తమ కంపెనీ మధ్య ఈశాన్య ఐరోపాలతో పాటుగా భారత్కు 8 ఎయిర్బస్ ఎ320 విమానాలతో 20 ప్రాంతాలకు సేవలనందిస్తున్నట్టుగా వెల్లడించారు. 2018 నాటికి కువైట్ ఇంటర్నెషనల్ ఎయిర్పోర్టులో జజీరా సొంత టెర్మినెల్ను ఏర్పాటు చేసే యత్నాల్లో ఉన్నట్టుగా తెలిపారు.