Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పనాజి: రాయల్ ఎన్ఫీల్డ్ రెండు సరికొత్త మోటర్ సైకిళ్లను ఆదివారం భారత మార్కెట్లోకి ఆవిష్కరిం చింది. ఇక్కడ ఏర్పాటు చేసిన వార్షిక రైడర్ మ్యానియా కార్యక్రమంలో ఎన్ఫీల్డ్కు చెందిన ఇంటర్సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 వాహనాలను ఐషర్ మోటార్స్ సీఈవో సిద్ధార్థ్లాల్ దేశీయ మార్కెట్లోకి ఆవిష్కరించారు. ఈ రెండు వాహనాలూ 650 సీసీ సామర్థ్యపు ఎయిర్ కూల్డ్, అయిల్ కూలర్ ఇంజిన్తో పాటు వివిధ ప్రత్యేకతలతో కంపెనీ రూపొందించింది. ఫ్యూయెల్ ఇంజెక్టర్ మోటార్తో కూడిన ఈ ఇంజిన్ 47పీఎస్ పవర్, 7,100 ఆర్పీఎంతో మెరుగైన సామర్థ్యాన్ని కలిగి ఉండనుందని లాల్ వెల్లడించారు. ఇంటర్సెప్టర్ వాహనాన్ని తమ సంస్థ ఆరు గేర్లతో కూడిన ప్రత్యేక గేర్ బాక్స్తో రూపొందించిందని తెలిపారు. ట్రాఫిక్లో కూడా సులభమైన రైడింగ్ను అందించేందుకు గాను సంస్థ స్లిప్ అసిస్ట్ క్లచ్ను అందిస్తోందని తెలిపారు. ఈ వాహనాన్ని 18 అంగుళాల పిరెళ్లీ టైర్లతో పాటు యాంటీ బ్రేకింగ్ స్టిస్టమ్, రెండు షాక్ అబ్జార్వర్స్తో మరింత మెరుగ్గా తయారు చేశారు. కాంటినెంటల్ జీటీ 650 వాహనం ఈ శ్రేణిలో ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న కాంటినెంటల్ 535 మాదిరి లక్షణాలతో మార్కెట్లోకి ఆవిష్కరించినట్టు సంస్థ తెలిపింది. ఇంజిన్ సామర్థ్యాన్ని మాత్రం పెంచి కొత్త లుక్తో దీనిని అందిస్తున్నట్టుగా లాల్ వెల్లడించారు. ఈ కొత్త మోటర్ సైకిళ్ల ధర రూ.3.00 లక్షలనుంచి రూ.3.5 లక్షల వరకు ఉంటుందని కంపెనీ వెల్లడించింది. వచ్చే మార్చి లేదా ఏప్రిల్ నుంచి కొత్త వాహనాలు దేశ వ్యాప్తంగా అమ్మకానికి అందుబాటులోకి రానున్నాయని వివరించారు.