Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ- బిజినెస్ డెస్క్: సహజ పౌష్టికహార, సౌందర్య ఉత్పత్తులను తయారు చేసే న్యూట్రాగ్రేస్ భారత మార్కెట్లోకి తమ ఉత్పత్తులను విడుదల చేస్తున్నట్టు ప్రకటించింది. మంగ ళవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ కంపెనీ అధిపతి సునీల్ ఆర్ గుప్తా మాట్లాడుతూ గత తొమ్మిదేండ్ల నుంచి తాము ఈ ఉత్పత్తులను ఎగుమతి చేస్తున్నామన్నారు. ప్రస్తుతం 100 పైగా ఉత్పత్తులను 13 దేశాలకు సరఫరా చేస్తున్నామని చెప్పారు. ఇకపై దేశంలో కూడా విక్రయించాలని నిర్ణయించామన్నారు. తొలుత దేశంలోని ఆరు నగరాల్లో అమ్మకాలు ప్రారంభిస్తున్నామని చెప్పారు.