Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజూ లాభాల్లో ముగిశాయి. దేశీయ, అంతర్జాతీయ సానుకూల పరిణామాల మధ్య మంగళవారం బీఎస్ఈ సెన్సెక్స్ 118.45 పాయింట్లు పెరిగి 33,478.35కు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 28.15 పాయింట్లు రాణించి 10,326.90 వద్ద ముగిసింది. బీఎస్ఈలో రంగాల వారిగా కన్సూమర్ డ్యూరెబుల్స్ సూచీ 1.98 శాతం, వైద్య సూచీ 1.76 శాతం, ఆయిల్ అండ్ గ్యాస్ 0.84 శాతం, విద్యుత్ 0.56 శాతం చొప్పున పెరిగి మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. మరోవైపు రియాల్టీ 1.33 శాతం, ఎఫ్ఎంసీజీ 0.17 శాతం, బ్యాంకింగ్ 0.05 శాతం, పీఎస్యూ 0.04 శాతం చొప్పున నష్టపోయాయి. కాగా సెన్సెక్స్లో డాక్టర్ రెడ్డీస్ 4.99 శాతం, సన్ఫార్మా 4.18 శాతం, సిప్లా 2.31 శాతం, భారతీ ఎయిర్టెల్ 2.13 శాతం, ఎన్టీపీసీ 1.61 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు కోల్ ఇండియా 1.51 శాతం, ఐటీసీ 1.08 శాతం, పవర్ గ్రిడ్ 1.03 శాతం, టీసీఎస్ 1.02 శాతం, కోటక్ బ్యాంకు 0.77 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూసిన వాటిలో టాప్లో ఉన్నాయి.