Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ఇండియన్ బ్యాంక్ హైదరాబాద్ జంటనగరాల్లో 'డిజిటల్ కార్నివాల్' నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా డిజిటల్ ఇండియాకు ఊతమిచ్చే విధంగా కేంద్రం ప్రవేశపెట్టిన భీమ్, భీమ్ ఆధార్ పే, భారత్ క్యూఆర్ లాంటి చెల్లింపు యాప్స్పై ఇండియన్ బ్యాంకు ప్రజల్లో అవగాహన కల్పిస్తోంది. ప్రధానంగా జంటనగరాల్లోని చిన్న వ్యాపారులు, విద్యా సంస్థలు, ప్రధాన షాపింగ్స్ మాల్స్, మార్కెట్లలో ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రజలకు రోజువారి జీవితంలో డిజిటల్ బ్యాంకింగ్ వల్ల కలిగే ప్రయోజనాలను తెలియజేసింది. దీనికితోడు పైనా పేర్కొన్న యాప్లను వందల సంఖ్యల్లో డౌన్లోడ్ చేసే విధంగా ప్రజలను ప్రోత్సహించినట్టు వివరించింది. ఇదే సమయంలో వ్యక్తిగత సమాచారం అయినా ఆధార్, పాన్, ఓటీపీ లాంటి వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించింది. మరోవైపు బ్యాంకు అధికారులమని ఫోన్ చేసే వారి పట్ల జాగ్రత్తగా వ్యవహరించాలని కూడా తెలియజేసింది.