Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి: ఐటీ కంపెనీల లాభాలతో దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం స్వల్ప లాభాలతో సరిపెట్టుకున్నాయి. మదుపర్లు అచితూచి వ్యవహరించడంతో రోజంతా మార్కెట్లు స్వల్ప హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. ఈనేపథ్యంలో బీఎస్ఈ సెన్సెక్స్ 26.53 పాయింట్లు లాభపడి 33,588.08 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిప్టీ 6.45 పాయింట్లు పెరిగి 10,348.75 వద్ద స్ధిరపడింది. ఇక బిఎస్ఇలో రంగాలవారిగా చూస్తే ఐటీ సూచీ 1.3శాతం, టెక్ 0.84శాతం, క్యాపిటల్ గూడ్స్ 0.45శాతం, కన్సూమర్ డురెబుల్స్ 0.43శాతం చొప్పున లాభపడ్డాయి. మరోవైపు లోహా సూచీ 0.34శాతం, ఆటో 0.23శాతం, మౌలికం 0.17శాతం చొప్పున నష్టపోయాయి.