Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలోనే అతిపెద్ద టెలికం కంపెనీ భారతీ ఎయిర్టెల్ చైర్మెన్ సునీల్ మిట్టల్ భారీ విరాళాన్ని ప్రకటించారు. తమ గ్రూప్నకు చెందిన దాతత్వ సంస్థ భారతి ఫౌండేషన్కు తమ సంపదలో 10 శాతం వాటాను విరాళంగా ఇవ్వనున్నట్టు వెల్లడించారు. ఇది దాదాపు రూ.7 వేల కోట్లకు సమానం. ఎయిర్టెల్లో భారతి కుటుంబానికి ఉన్న మూడు శాతం వాటా కూడా ఈ మొత్తంలోనే ఉందని సునీల్ మిట్టల్ పేర్కొన్నారు. వెనకబడిన వర్గాలకు చెందిన నిరుపేద యువతకు ఉచిత విద్య అందించేందుకు సత్య భారతి యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు.