Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: రాబోయే భవిష్యత్తు విద్యుత్ కార్లదేనని మహీంద్రా ఎలక్ట్రిక్ సీఈవో మహేష్ బాబు అన్నారు. దేశ వ్యాప్తంగా ముఖ్య నగరాల్లో పెరుగుతున్న కాలుష్యం నేపథ్యంలో విద్యుత్ కార్ల వైపు మొగ్గు చూపాల్సిన పరిస్థితి చోటు చేసుకుంటుందన్నారు. గురువారం హైదరాబాద్లో ఆయన జూమ్కార్ వేదికపై 20 మహీంద్రా 'ఈ2ఓ ఫ్లస్' ఎలక్ట్రిక్ సిటీ స్మార్ట్ కార్లను ఆవిష్కరించారు.