Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ప్రీమియం వసూళ్లలో 20 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నామని శ్రీరామ్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ ఎండీ, సీఈవో కాస్పారస్ క్రోమ్హౌట్ అన్నారు. గురువారం హైదరాబాద్లో ఆయన పిల్లల చదువు అవసరాలను తీర్చేలా 'శ్రీరామ్ లైఫ్ జీనియస్ అస్యూర్డ్' బెనిఫిట్ ప్లాన్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ క్రితం ఆర్ధిక సంవత్సరంలో రూ.1200 కోట్ల ప్రీమియం వసూళ్లు చేశామన్నారు. ప్రస్తుత ఏడాదిలో మెరుగైన వృద్ధి సాధించాలని నిర్దేశించుకున్నామని చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో తమ మార్కెట్ వాటా 7 శాతంగా ఉందన్నారు. గత ఆర్ధిక సంవత్సరంలో ఈ రాష్ట్రాల నుంచి రూ.263 కోట్ల ప్రీమియం వచ్చిందన్నారు.