Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ప్రముఖ విద్యుత్ ఉపకరణాల సంస్థ వి గార్డ్ ఇండిస్టీస్ లిమిటెడ్ మార్కెట్లోకి కొత్త స్మార్ట్ సీరిస్ ఇన్వర్టర్లను విడుదల చేసింది. వీటి ధరలు రూ.10,890 నుంచి రూ.18,990గా నిర్ణయించింది. గురువారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆ కంపెనీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ రామచంద్రన్ మాట్లాడుతూ ప్రస్తుతం ఇన్వెర్టర్ల మార్కెట్ రూ.6500-రూ.7,000 కోట్ల మధ్య విలువ చేస్తుందన్నారు. గతేడాది 21 లక్షల యూనిట్ల మేర అమ్మకాలు జరిగాయన్నారు. ఇందులో విగార్డు 4.5 లక్షల యూనిట్లు అమ్మకాలు చేసిందన్నారు. వీటి అమ్మకాల్లో 50 శాతం వృద్ధిని అంచనా వేస్తున్నామని చెప్పారు. గత ఆర్ధిక సంవత్సరంలో తమ కంపెనీకి ఇన్వెర్టర్ల వ్యాపారం నుంచి రూ.220 కోట్ల రెవెన్యూ సమకూరిందని తెలిపారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో రూ.300 కోట్ల రెవెన్యూ అంచనా వేస్తున్నామని చెప్పారు. విగార్డు ఈ మధ్య కాలంలోనే 40 ఏళ్ల వసంతాలను పూర్తి చేసుకుందన్నారు.