Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సమ్మతి తెలిపిన వాటాదారులు
ముంబయి: ఔషధ రంగ దిగ్గజ సంస్థ లూపిన్ సెక్యూరిటీలను జారీ చేయడం ద్వారా మార్కెట్ల నుంచి దాదాపు రూ.7,500 కోట్ల మేర నిధులను సమీకరించనుంది. ఈ ప్రతిపాదనకు వాటాదారుల సమ్మతి లభించినట్లుగా సంస్థ శనివారం ప్రకటించింది. రూ.7,500 కోట్లకు మించకుండా నిధుల సమీకరణకు వాటాదారులు తమ సమ్మతి తెలిపినట్లుగా సంస్థ బీఎస్ఈకి తెలియజేసింది. దీనికి తోడు ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్గా ఉన్న దేశ్ బంధు గుప్తాను మరో అయిదేళ్ల పాటు సంస్థలోకి తీసుకొనే ప్రతిపాదనకు కూడా షేర్ హోల్డర్స్ పచ్చ జెండా ఊపినట్లు సంస్థ వివరించింది. సంస్థ సభ్యులు లూపిన్ ఉపాధ్యక్షుడు కమల్ కె శర్మ యొక్క పునర్ నియామకానికి కూడా తమ సమ్మతి తెలియజేసినట్లుగా సంస్థ వెల్లడించింది. రూ.7500 కోట్ల మేర నిధుల సమీకరణకు గత నెలలో కంపెనీ బోర్డు సమ్మతి తెలియజేసింది.