Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆగస్టు నుంచి దాదాపు రూ.30 వేల వరకు పెంపు
చెన్నై: దేశంలో రెండో అతిపెద్ద కార్ల తయారీ సంస్థ హ్యుందాయ్ మోటార్ ఇండియా (హెచ్ఎంఐఎల్) తమ కార్ల ధరను పెంచనున్నట్లుగా వెల్లడించింది. కొత్తగా మార్కెట్లోకి తెచ్చిన ఎస్యూవీ 'క్రెటా' తప్ప మిగతా అన్ని హ్యుందారు వాహనాల ధరలను పెంచనున్నట్లు హెచ్ఎంఐఎల్ తెలిపింది. పెంపు దాదాపు రూ.30 వేల వరకు ఉంటుందని సంస్థ వెలువరించింది. హెచ్ఎంఐఎల్ ఆగస్టు 1 నుంచి పెరిగిన ధరలకు కార్లును విక్రయించనుంది. తయారీ వ్యయం పెరిగిన కారణంగా కార్ల ధరలను పెంచాల్సిన పరిస్థితి నెలకొందని సంస్థ అమ్మకాలు, మార్కెటింగ్ విభాగం సీనియర్ ఉపాధ్యక్షుడు రాకేష్ శ్రీవాస్తవా తెలిపారు. ప్రస్తుత ఛాలెంజింగ్గా తయారైన పోటీ మార్కెట్లో ధరలు పెరగకుండానే అమ్మకాలను జరిపేందుకు తాము చాలా వరకు తయారీ వ్యయాన్ని బరిస్తూ వచ్చామని.. ఇప్పుడు ఇక ధరలను తప్పక పెంచాల్సిన పరిస్థితుల నేపథ్యంలోనే ఈ తరహా నిర్ణయం తీసుకున్నట్లుగా ఆయన తెలిపారు.