Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్
హైదరాబాద్ : నగదు రహిత లావాదేవీలకు మరిన్ని ప్రోత్సాహకాలు ఇవ్వాలని ఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ హెచ్ఆర్ ఖాన్ అన్నారు. తద్వారా భారత్ నగదురహిత ఆర్థిక వ్యవస్థ లక్ష్యానికి చేరడానికి దోహదం చేస్తుందన్నారు. బుధవారం హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ గతేడాది నవంబర్లో కేంద్ర ప్రభుత్వం రూ.1,000, రూ.500 నోట్లు రద్దు చేసి డిజిటల్ చెల్లింపులకు కొన్ని ప్రోత్సాహాకాలు అందించిందన్నారు. కాగా నోట్ల రద్దు వల్ల పలు విపత్కర పరిస్థితులు చోటు చేసుకున్నాయన్నారు. కానీ అనంతరం డిజిటల్ చెల్లింపుల్లో మాత్రం పెరుగుదల నమోదయ్యిందన్నారు. అయితే డిజిటల్ లావాదేవీల వైపు ప్రజలను మళ్లీంచేందుకు పలు స్థాయిల్లో ప్రోత్సాహాకాలు అందించాల్సిన అవసరం ఉందన్నారు.