Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ : దేశంలో టోకు ద్రవ్యోల్బణం కూడా ఎగిసిప డుతుంది. ఉల్లి, కూరగాయల ధరలు పెరగడంతో ప్రస్తుత ఏడాది నవంబర్లో టోకు ద్రవ్యోల్బణం సూచీ (డబ్ల్యూపీఐ) 3.93 శాతానికి పెరిగిందని గురువారం కేంద్ర గణంకాల శాఖ వెల్లడించింది. ఇంతక్రితం అక్టోబర్లో ఇది 3.59 శాతంగా నమోదయ్యింది. గతేడాది నవంబర్లో 1.82 శాతంగా ఉంది. గత మాసంలో ఏడాది ప్రాతిపదికన పోల్చితే ఉల్లి ధరలు ఏకంగా 178.19 శాతం ఎగిశాయి. కొన్ని కూరగాయల ధరలు 59.80 శాతం పెరిగాయి కోడిగుడ్లు, మాంసం, చేపల ధరలు మాత్రము 5.76 శాతం నుంచి 4.73 శాతానికి తగ్గాయి. స్థూలంగా అహారోత్పత్తుల ధరలు 6.06 శాతానికి పెరిగాయి. అక్టోబర్లో వీటి ధరలు 4.30 శాతంగా చోటు చేసుకున్నాయి. కాగా గత నెలలో తయారీ రంగం ఉత్పత్తుల ధరలు స్వల్పంగా తగ్గి 2.61 శాతంగా నమోదయ్యాయి. అక్టోబర్లో ఇవి 2.62 శాతంగా ఉన్నాయి. కాగా నవంబర్లో రిటైల్ ద్రవ్యోల్బణం సూచీ ఏకంగా 4.88 శాతానికి ఎగిసి 15 నెలల గరిష్ట స్థాయికి చేరాయని గత వారంలో సీఎస్వో తెలిపింది.