Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ఇంటెక్స్ టెక్నాలజీస్ దేశ మార్కెట్లోకి నూతన శ్రేణీ వైర్లెస్ 'డీజే' స్పీకర్లను విడుదల చేసింది. గురువారం హైదరాబాద్లో వీటిని ఆ కంపెనీ ఐటీ ప్రొడక్ట్స్ డివిజన్ ఇన్చార్జి వినరు కపూర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ డీజే స్పీకర్ల ధరలు రూ.13,999, రూ.18,999గా, టవర్ స్పీకర్ల ధర రూ.14,200గా నిర్ణయించామన్నారు. యువతను లక్ష్యంగా పెట్టుకుని వీటిని అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరంలో ఇంటెక్స్ రూ.6,000 కోట్ల టర్నోవర్ లక్ష్యంగా పెట్టుకుందని, ఇందులో ఐటీ విభాగం నుంచి రూ.500 కోట్ల రెవెన్యూ అంచనా వేస్తున్నామన్నారు. తమ ఐటీ వ్యాపారంలో స్పీకర్ల వాటా సగం ఉంటుందని భావిస్తున్నామన్నారు.