Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : నీటిశుద్ధి, ద్రవ్య వ్యర్థాల నిర్వహణ, పర్యావరణ పరిష్కారాల్లో పరిశ్రమ అగ్రగామీగా ఉన్న అయాన్ ఎక్సేంజీ ఇండియా లిమిటెన్ ఫార్మా పరిశ్రమ ప్రత్యేక అవసరాల కోసం ఇండియన్ స్విప్ట్ 5జిఎక్స్ను అందుబాటులోకి తెచ్చినట్లు ప్రకటించింది. అధిక స్వచ్ఛత నీటి ఉత్పత్తి, ఉత్పాదనకు దోహదం చేస్తుందని ఆ కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఫార్మాస్యూటికల్ ఇంజనీర్లు, ఎండ్ యూజర్స్తో చర్చించి ఈ ఉత్పాదన డిజైన చేయబడిందని పేర్కొంది. ఇండియన్ ప్యూరిఫైడ్ వాటర్ సిస్టమ్స్ శ్రేణిలో ఈ రంగానికి కంపెనీ యొక్క ఉత్పాదన శ్రేణీ విస్తరణను ఈ ఆవిష్కారం తెలియజేస్తుందని ఆ కంపెనీ ప్రెసిడెంట్ అజరు పోపట్ పేర్కొన్నారు. ఈ నూతన విశిష్ట సాంకేతి కతను పరిచయం చేయడం ద్వారా సామర్థ్యాన్ని, స్వచ్ఛతను ఇండియన్ స్విప్ట్ 5జీఎక్స్ మెరుగుపర్చుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.