Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గత వారం లాభాలు
- మార్కెట్ రివ్యూ
ముంబయి : డిసెంబర్ 18తో ప్రారంభమయ్యే వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లను ప్రధానంగా గుజరాత్ శాసన సభ ఎన్నికల ఫలితాలు ప్రభావితం చేయనున్నాయని విశ్లేషకులు పేర్కొంటున్నారు. బీజేపీికి అనుకూలంగా వచ్చిన ఎగ్జిట్ పోల్స్కు ప్రతికూలంగా వాస్తవ ఫలితాలు వస్తే మార్కెట్లు నష్టాలు చవి చూసే అవకాశం ఉంది. అలాంటి ఫలితాలు వస్తే తాత్కాలిక, మధ్యస్థ కాలంలో మార్కెట్ల సెంటిమెంట్పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయి. సోమవారం గుజరాత్ ఎన్నికల ఫలితాలు వెల్లడి కానున్నాయి. అదే విధంగా శీతాకాల సమావేశాల నిర్ణయాలను మదుపర్లు కీలకంగా తీసుకోనున్నారు. గుజరాత్ ఎన్నికల ఫలితాలకు తోడు అంతర్జాతీయ పరిణామాలు, అమెరికాలో పన్ను సంస్కరణలు మార్కెట్లను దశ, దిశపై ప్రభావం చూపనున్నాయి.
డిసెంబర్ 15తో ముగిసిన వారంలో వివిధ ప్రతికూల అంశాలు చోటు చేసుకున్నప్పటికీ గుజరాత్ ఎన్నికల్లో బీజేపీ గెలుపొందచ్చన్న ఎగ్జిట్ పోల్స్ అంచనాల్లో మార్కెట్లు లాభాలు సాధించాయి. ప్రస్తుత ఏడాది నవంబర్లో అహారోత్పత్తుల ధరలు పెరగడంతో రిటైల్, టోకు ద్రవ్యోల్బణం ఎగిశాయి. రిటైల్ ద్రవ్యోల్బణం 4.88 శాతానికి ఎగిసింది. అదే విధంగా అక్టోబర్ పారిశ్రామికోత్పత్తి సూచీ వృద్ధి 2.2 శాతానికి పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్లను పెంచింది. అయినప్పటికీ ఎగ్జిట్ పోల్స్ అంచనాల మధ్య మార్కెట్లు లాభాలు ఆర్జించాయి. ఈ పరిణామాల మధ్య క్రితం శుక్రవారంతో ముగిసిన వారంలో బిఎస్ఇ సెన్సెక్స్ 0.6 శాతం, నిఫ్టీ 0.7 శాతం చొప్పున పెరిగి వరుసగా 33,463, 10,333కు చేరాయి. కాగా మిడ్క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు 0.4 శాతం, 0.2 శాతం చొప్పున పెరిగాయి.