Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్:
క్రియేటివ్ ఎక్స్పర్ట్స్కు చెందిన అంగో ఫ్రేమ్వర్క్ బ్రాండ్ వచ్చే మార్చి నాటికి మిలియన్ డాలర్లు (సుమారు రూ.6.7 కోట్లు) సమీకరించనున్నట్టు తెలిపింది. ఈ కంపెనీ మొబైల్, వెబ్ అప్లికేషన్లను రూపొందిస్తుంది. సోమవారం హైదరాబాద్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో అంగో ఫ్రేమ్వర్క్ వ్యవస్థా పకులు, సీఈవో రామ కుప్పా మాట్లా డుతూ కృత్రిమ మేధస్సుతో కేవలం 60 నిమిషాల్లోనే తాము చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు యాప్ను రూపొందించి ఇస్తామన్నారు. దీంతో వ్యాపారస్తులకు సమయం ఆదా అవుతుందన్నారు. గత ఏడాది కాలంలో 480 పైగా యాప్లను అభివృద్ధి చేసి అందించామన్నారు. 28 స్టార్టప్లకు డిజైనింగ్లో తోడ్పడ్డామన్నారు.