Authorization
Mon Jan 19, 2015 06:51 pm
న్యూఢిల్లీ: ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్తో ముగిసిన ప్రథమార్థంలో బ్యాంకుల మొండి బాకీలు రూ.8.50 లక్షల కోట్లకు చేరాయని ఆర్ధిక శాఖ సహాయ మంత్రి శివ్ ప్రతాప్ శుక్లా తెలిపారు. 2017 మార్చి 31 నాటితో మొండి బాకీలను పోల్చితే ప్రథమార్థంలో 9.5 శాతం ఎన్పీఏలు పెరిగాయని సోమవారం లోకసభకు తెలిపారు. బ్యాంకులకు అతి భారంగా మారిన రూ.5,000 కోట్ల పైబడిన మొండి బాకీల వసూళ్లకు ఆర్బీఐ చర్యలు తీసుకుంటుందన్నారు. వీటి వసూళ్లకు బ్యాంకులకు ఇప్పటికే సూచనలు అందించిందన్నారు. మొత్తం బ్యాంకు మొండి బాకీల్లో కేవలం 12 ఖాతాలే 25 శాతం వాటా కలిగి ఉన్నాయన్నారు. ప్రభుత్వం నగదు రహిత లావాదేవీల కోసం డిజిటలైజేషన్ను ప్రోత్సహిస్తుందన్నారు.