Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒక్కసారిగా 867 పాయింట్ల పతనం
- తుదకు సెన్సెక్స్ 139 పాయింట్లు ర్యాలీ
- రూపాయి క్షీణత ొగుజరాత్ ఫలితాల ఎఫెక్ట్
ముంబయి: గుజరాత్ ఎన్నికల ఫలితాలు దలాల్ స్ట్రీట్లో అలజడి లేపాయి. ఈ రాష్ట్రంలో బీజేపీ ఓడిపోతుందన్న అంచనాలు, ఊహాగానాలు సోమవారం ఓ దశలో దేశీయ స్టాక్ మార్కెట్లను తీవ్ర ఒత్తిడికి గురి చేశాయి. ఇంట్రా ట్రేడింగ్లో సెన్సెక్స్ ఏకంగా 800 పైగా పాయింట్లు కోల్పోయింది. ఓట్ల లెక్కింపులో బీజేపీ క్రమంగా పుంజుకుంటుందన్న వార్తలతో తుదకు మార్కెట్లు భారీ నష్టాల నుంచి బయటపడటంతో మదుపర్లు ఊపిరి పీల్చుకున్నారు. మార్కెట్ల పతనంతో పాటు రూపాయి మారకం విలువ కూడా 68 పైసల మేర విలువ కోల్పోయింది. ఉదయం 33,364.52 వద్ద మొదలైన సెన్సెక్స్ కొద్ది నిమిషాల్లోనే ఏకంగా 867.34 పాయింట్లు పతనమై 32,595.63 కనిష్ట స్థాయిని తాకింది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా విజయం వైపు పయనిస్తున్నప్పటికీ, అధికార పార్టీకి కాంగ్రెస్ గట్టి పోటీ నివ్వడం మార్కెట్లను ఒడిదుడులకు గురి చేసింది. ఈ పరిణామం మధ్య నష్టాల నుంచి పుంజుకుని క్రమంగా లాభాల్లోకి సాగి తుదకు 138.71 పాయింట్లు పెరిగి 33,801.90కు చేరింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 55.50 పాయింట్లు ఎగిసి 10,388 వద్ద ముగిసింది. ఉదయం నిఫ్టీ 258 పాయింట్లు పతనమై 10,075 వద్ద ముగిసింది.
కాగా అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్లో డాలర్తో రూపాయి మారకం విలువ ఓ దశలో 68 పాయింట్లు పతనమై 64.72కు పడిపోయినప్పటికీ తుదకు 19 పైసల నష్టంతో 64.23 వద్ద ముగిసింది. తుదకు బీఎస్ఈలో రంగాల వారిగా లోహ సూచీ 1.83 శాతం, ఆటో 1.21 శాతం, కన్సూమర్ డ్యూరెబుల్స్ 0.94 శాతం, వైద్య సూచీ 0.78 శాతం చొప్పున పెరిగి మార్కెట్లకు మద్దతుగా నిలిచాయి. రియాల్టీ 0.29 శాతం నష్టపోయింది. సెన్సెక్స్లో మహీంద్రా అండ్ మహీంద్రా 2.71 శాతం, సన్పార్మా 2.06 శాతం, ఎస్బీఐ 1.97 శాతం, విప్రో 1.9 శాతం చొప్పున అధిక లాభాలు సాధించిన వాటిలో ముందు వరుసలో ఉన్నాయి. మరోవైపు యెస్ బ్యాంకు 1.23 శాతం, కోల్ ఇండియా 1.11 శాతం, ఇన్ఫోసిస్ 0.79 శాతం, ఐటీసీ 0.62 శాతం, కోటక్ బ్యాంకు 0.53 శాతం చొప్పున అధిక నష్టాలు చవి చూశాయి.