Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రూ.880 కోట్లతో ఒఎన్జిసి సిద్ధం
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ (ఒఎన్జిసి) కేజి బేసిన్లో 2018-19 మధ్య కాలంలో చమురు, గ్యాస్ను వెలికి తీయటానికి వందల కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టాలని నిర్ణయించింది. ఒఎన్జిసికి కేజీ బేసిన్లో 12 గ్యాస్ నిక్షేపాలు ఉన్నాయి. ఒఎన్జిసి మరో భాగస్వామితో కలిసి 11 చమురు నిక్షేపాలను అభివృద్ది చేయాలని ప్రణాళికలు సిద్ధం చేసింది. జి-4 బ్లాక్లో గ్యాస్ను వెలికి తీయటానికి 880 కోట్ల పెట్టుబడి పెట్టాలని నిర్ణయించినట్టు కంపెనీ వర్గాల సమాచారం. దీనిలో భాగంగా చమురును, గ్యాస్ను వెలికి తీయటానికి 45 బావులను తవ్వతారు. వెలికి తీసిన చమురును ప్లోటింగ్ ప్రోడక్షన్ సిస్టమ్ ద్వార నౌకల్లోకి చేరుస్తారు. 2018 జూలై నాటికి గ్యాస్ను, 2019 ఆగస్ట్ నాటికి చమురును వెలికి తీస్తామని కంపెనీ ఉన్నతాధికారులు తెలిపారు.