Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ, బిజినెస్ డెస్క్: ప్రస్తుత ఏడాదిలో ద్విచక్ర వాహన విభాగంలో 25 శాతం మార్కెట్ వాటా సాధించాలని బజాజ్ ఆటో నిర్దేశించుకుంది. శుక్రవారం హైదరాబాద్లో డిస్కవర్ రేంజీలో రెండు కొత్త బైకులను స్థానిక మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ సందర్బంగా బజాజ్ ఆటో మోటార్ సైకిల్స్ ప్రెసిడెంట్ ఎరిక్ వాసు మాట్లాడుతూ ప్రస్తుతం ద్విచక్ర వాహన విభాగంలో తమకు 17-18 శాతం మార్కెట్ వాటా ఉందన్నారు. 2018 ముగింపు నాటికి దీన్ని 24-25 శాతానికి పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. డిస్కవరీ రేంజీలో ప్రస్తుతం నెలకు 10,000 యూనిట్ల అమ్మకాలు జరుగుతున్నాయని, వీటిని 70వేల-80వేలకు చేర్చాలని నిర్దేశించుకున్నామన్నారు. ప్రస్తుతం ప్రతీ నెల తాము సగటున 1.7-1.8 లక్షల యూనిట్ల మోటార్ సైకిళ్లను విక్రయిస్తున్నామని చెప్పారు. అదే విధంగా ఇంతే స్థాయిలో 60 దేశాలకు ఎగుమతులు చేస్తున్నామని చెప్పారు. న