Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ముంబయి : ప్రపంచ వ్యాప్తంగా బిట్కాయిన్కు పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో ముఖేష్ అంబానీ కూడా ఈ తరహా క్రిప్టోకరెన్సీపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. మింట్ కథనం ప్రకారం రిలయన్స్ జియో ఇన్ఫోకమ్ సొంతగా 'జియో కాయిన్' పేరుతో క్రిప్టో కరెన్సీని రూపొందించే పనిలో ఉంది. ఇందుకోసం 50 మంది పని చేస్తున్నారు. అంబానీ పెద్ద కుమారుడు ఆకాశ్ ఆధ్వర్యంలో ఈ బృందం పని చేస్తుంది. బిట్ కాయిన్ ఈ మధ్య కాలంలో కొన్ని రెట్లు పెరిగి ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఇది కూడా ఒక విధమైన పొంజీ స్కీమ్ లాంటిదేనని ఆర్థిక మంత్రిత్వ శాఖ అభిప్రాయపడిన విషయం తెలిసిందే.